
దర్శకుడు వి.యన్. ఆదిత్య మాట్లాడుతూ ‘సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. తమ మాయమాటలతో జనాల్ని బురిడీ కొట్టించే ముగ్గురి మాయగాళ్ల కథ ఇది. రెండున్నర గంటలు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతుంది’ అన్నారు. సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ ‘పాటలన్నీ మెలోడీ ప్రధానంగా ఆకట్టుకుంటాయి. పాటలన్నీ చక్కటి బాణీలతో పాటు దృశ్యపరంగా కూడా మంచి అనుభూతినిస్తాయి.
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నా పాత్ర చిత్రణ ఆసక్తికరంగా వుంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేయడం ఆనందంగా వుంది’ అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో నటించడం పట్ల కథానాయికలు సంజన, శ్రద్ధాదాస్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అహుతివూపసాద్, వేణుమాధవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, కెమెరా: జవహర్డ్డి, కథస్కీన్ప్లే, దర్శకత్వం: నాగేంద్ర వి ఆదిత్య.
No comments:
Post a Comment