Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, July 26, 2011

‘ముగ్గురు’వస్తున్నారు

Shraddha Das Photo Galleryడి. రామానాయుడు నిర్మాతగా సురేష్‌వూపొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘ముగ్గురు’ (‘మహా మాయగాళు’్ల ఉపశీర్షిక). వి.యన్.ఆదిత్య దర్శకుడు. నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్, రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్షికమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో రామానాయుడు మాట్లాడుతూ ‘ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల చక్కటి సహకారంతో 37రోజుల్లో చిత్రాన్ని పూర్తిచేశాం. కారంచేడు, వైజాగ్, మలేషియాల్లో చిత్రీకరణ జరిపాం. ఆగస్టు 5న ఆడియోను విడుదల చేస్తాం’ అన్నారు.

దర్శకుడు వి.యన్. ఆదిత్య మాట్లాడుతూ ‘సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. తమ మాయమాటలతో జనాల్ని బురిడీ కొట్టించే ముగ్గురి మాయగాళ్ల కథ ఇది. రెండున్నర గంటలు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతుంది’ అన్నారు. సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ ‘పాటలన్నీ మెలోడీ ప్రధానంగా ఆకట్టుకుంటాయి. పాటలన్నీ చక్కటి బాణీలతో పాటు దృశ్యపరంగా కూడా మంచి అనుభూతినిస్తాయి.

అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నా పాత్ర చిత్రణ ఆసక్తికరంగా వుంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేయడం ఆనందంగా వుంది’ అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో నటించడం పట్ల కథానాయికలు సంజన, శ్రద్ధాదాస్‌లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అహుతివూపసాద్, వేణుమాధవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, కెమెరా: జవహర్‌డ్డి, కథస్కీన్‌ప్లే, దర్శకత్వం: నాగేంద్ర వి ఆదిత్య.

No comments:

Post a Comment