మహేష్ బాబు 'బిజినెస్ మేన్'అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని 'సేల్స్ మెన్' అంటున్నారు. దానికి కారణం ఆయన బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని ఓ రేంజిలో ప్రమోట్ చెయ్యటమే. సినిమా మొదలైన రోజునుంచి ఇప్పుటివరకూ ఆ చిత్రం గురించి తన చిత్రాల కన్నా ఎక్కువగా మార్కెట్ చేస్తున్నారు. ట్విట్టర్ లో స్టేజిపై మహేష్ ని పూరీని,బిజినెస్ మ్యాన్ ని పొగడటమే పనిగా పెట్టుకున్నారు. అంతేగాక బిజినెస్ మ్యాన్ చిత్రం సీక్వెల్ కు కూడా అప్పుడే ప్రమోషన్ ప్రారంబించేసారు. దాంతో మహేష్,పూరీ చేసే ప్రాడొక్టులకు వర్మ సేల్స్ మెన్ గా మారాడనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఆయన తాజా ట్వీట్ ''అహ్హహహ.. పూరి ఇప్పుడే 'బిజినెస్మేన్-2' కథ చెప్పాడు. సీక్వెల్ చేసే బిజినెస్తో పోలిస్తే 'బిజినెస్మేన్' ఫ్లాప్ అయినట్టుగా అనుకోవాలి. 'బిజినెస్మేన్' చిత్రంలో మహేష్ బాబు పాత్రను సీక్వెల్ కోసం మరింత చక్కగా పూరి మలిచాడు'' కూడా ఆ మాటకు ఊతం ఇస్తోంది.
ఇక ఈ సేల్స్ మెన్ స్టాటజీ వెనక వర్మ బిజినెస్ ఆలోచనలు ఉన్నాయంటున్నారు. ఈ చిత్రాన్ని హిందిలో రీమేక్ చేసి తాను నిర్మాతగా క్రేజ్ సంపాదిద్దామనే ఆలోచన చేసారు. అయితే హిందీలో నటించటానికి మహేష్ మొగ్గు చూపకపోవటంతో మహేష్బాబును తన చిత్రంతో బాలీవుడ్కు పరిచయం చేయాలనే వర్మ ప్రయత్నాలు వీగిపోయాయి. దాంతో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఇక్కడ హిట్ రేంజిని చూపి వల వేస్తున్నారు. అతను ఓకే అంటే పూరి దర్శకత్వంలో సినిమా ప్రారంభించి పూర్తి కాకముందే అమ్మే యోచనలో ఉన్నారు వర్మ అని ముంబై సమాచారం.
ఇక ఈ సేల్స్ మెన్ స్టాటజీ వెనక వర్మ బిజినెస్ ఆలోచనలు ఉన్నాయంటున్నారు. ఈ చిత్రాన్ని హిందిలో రీమేక్ చేసి తాను నిర్మాతగా క్రేజ్ సంపాదిద్దామనే ఆలోచన చేసారు. అయితే హిందీలో నటించటానికి మహేష్ మొగ్గు చూపకపోవటంతో మహేష్బాబును తన చిత్రంతో బాలీవుడ్కు పరిచయం చేయాలనే వర్మ ప్రయత్నాలు వీగిపోయాయి. దాంతో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఇక్కడ హిట్ రేంజిని చూపి వల వేస్తున్నారు. అతను ఓకే అంటే పూరి దర్శకత్వంలో సినిమా ప్రారంభించి పూర్తి కాకముందే అమ్మే యోచనలో ఉన్నారు వర్మ అని ముంబై సమాచారం.
No comments:
Post a Comment