Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, June 14, 2011

ఒక్క హిట్‌తోనే కొమ్ములొచ్చాయా... రాంచరణ్!!?: నట్టి


"చిరంజీవి కుమారుడిగా నీవు తెలుసు. లేదంటే... నువ్వెవరూ... జీరో. అటువంటి వాడివి మీ తండ్రికి దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావునే విమర్శించే అర్హత నీకెక్కడిది. అసలు నువ్వెంత... బచ్చాగాడివి.." అంటూ రామ్‌చరణ్‌తేజపై నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. 

వివరాల్లోకి వెళితే... ఇటీవలే ఓ కార్యక్రమంలో దాసరి మాట్లాడుతూ, వంశీ, నంది అవార్డులకు కూడా కోట్లు తీసుకునే కథానాయికలు రావడంలేదు. వారిని పిలవకండి అని అన్నారు. ఈ విషయమై శుక్రవారం ఫిలింఫేర్‌ అవార్డుల మీడియా సమావేశంలో పాల్గొన్న రామ్‌చరణ్‌తేజ్‌ను అడిగితే.. దాసరి అన్నది తప్పు.. గత ఏడాది నేను ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమానికి వెళ్ళాను. చాలామంది కథానాయికలు హాజరయ్యారని వ్యాఖ్యానించారు.

దీనిపై శనివారంనాడు దాసరి శిష్యుడు నట్టికుమార్‌ తీవ్రంగా స్పందించారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడవద్దని రామ్‌చరణ్‌తేజ్‌కు సూచించారు. దాసరి నంది అవార్డుల కార్యక్రమానికి రాని హీరోయిన్లను గురించి అన్నారు. కోట్లు తీసుకుని ప్రమోషన్‌కు రాని హీరోయిన్ల గురించి అన్నారు. విషయం సరిగ్గా తెలుసుకోకుండా ఏవేవో పేలితే మర్యాద దక్కదు. 

నువ్వు వెంటనే దాసరిగారికి బహిరంగ క్షమాపణ తెలియజేయాలి. లేదంటే.. మీ తండ్రే నీ వెనుక ఉండి చేయించారనే నమ్ముతాముం. నువ్వు చేసింది రెండు సినిమాలు 1 ఫట్‌, 1 హిట్‌.. దీనికే కొమ్ములొచ్చాయా? అంటూ మండి పడ్డారు. మీ బాబాయ్‌ 45 కోట్లతో 'ఆరెంజ్‌' తీశాడు. ఎంత నష్టపరిచావు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో.." అంటూ ధ్వజమెత్తాడు నట్టి.

బాలు ఫంక్షన్‌కు నువ్వు రాలేదే!
హీరోయిన్లను సపోర్ట్‌ చేసి మాట్లాడుతున్నావ్‌. ఎస్‌.పి. బాలుకు పద్మ అవార్డు వస్తే ఇండస్ట్రీ సన్మానించింది. నువ్వు రాలేదే. అలాంటివాడివి ఇలా దాసరిని విమర్శించే హక్కు నీకెక్కడిది? దయచేసి నువ్వు మాట్లాడిన మాటలు విరమించుకో. అసలు దాసరి పేరు పలికే అర్హత నీకులేదు... అంటూ ధ్వజమెత్తారు.

No comments:

Post a Comment