Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, June 14, 2011

పాపం తాప్సీ పిల్ల.. భోరున ఏడ్చేసింది: మంచు లక్ష్మి


ఇటీవల తాప్సీ గురించి వార్తలు రకరకాలుగా వస్తూనే ఉన్నాయి. మోహన్‌బాబు ఫ్యామిలీతో ఆమెకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ కథనాలు వస్తున్నాయి. "ఝుమ్మంది నాదం" చిత్రంద్వారా తాప్సీ చలనచిత్రరంగానికి పరిచయమై ఇప్పుడు తమిళ రంగంలోనూ రాణిస్తోంది. 

మంచు వంశం ఇద్దరి కొడుకులతో హీరోయిన్‌గా నటించింది. అయితే.. ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. మోహన్‌బాబు కూడా ఆమెతో నటించాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఈ పాయింట్‌ బేస్‌ చేసుకుని ఓ ఛానల్‌ మోహన్‌బాబు‌కు నో చెప్పిందంటూ.. తెగ ప్రచారం చేసి ఆమె నటించిన చిత్రాల గురించి తెగ వేసేశాయి. లక్ష్మీప్రసన్నతో ఆమె చాలా చనువుగా ఉండేదంటూ కూడా చెప్పేశాయి. 

ఇటీవలే లక్ష్మీప్రసన్న ఛాంబర్‌లో తాప్సీపై ఫిర్యాదు చేసిందనీ, తమనుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం ఆమె ఇంకా చిత్రాలు చేయాలనేది సారాంశం. ఏదిఏమైనా ప్రస్తుతం తాప్సీ వారికి దూరంగా ఉంది. ఈ విషయం టీవీల్లో వచ్చేసరికి లక్ష్మీప్రసన్న ఇలా చేయిస్తుందని భావించినట్లు అనుకుందేమో వెంటనే... ఫోన్‌ చేసి... ఏడ్చేసిందట. ఈ విషయాన్ని లక్ష్మీ స్వయంగా చెప్పింది. 

పిచ్చాపాటీ మాట్లాడుతూ... పాపం.. తాప్సీ గురించి తెగ రాసేస్తున్నారు. నా దగ్గర ఏడ్చేసింది. నేను మిమ్మల్ని మోసం చేశానా? అంటూ ఫీలయిందని అంది. మరి తాప్సీని కలిస్తేగానీ అసలు విషయం తెలియదు.

No comments:

Post a Comment